Monday, 27 July 2026 08:46:42 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

రాష్ట్రంలో గిరిజనుల రిజర్వేషన్లు 10% పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం పట్ల గిరిజనులు హర్షం...

Date : 20 September 2022 06:20 PM Views : 1038

తెలంగాణ / ఖమ్మం జిల్లా : సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం, గంగదేవిపాడు గ్రామం లో బంజారాగిరిజనులు, హర్షం వ్యక్తం చేస్తూ బంజారా సాంప్రదాయ నృత్యాలతో ర్యాలీ నిర్వహించి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఘన స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పూలు,పాలాభిషేకం ను బంజా రగిరిజన మహిళలు చేశారు. గిరిజనులపై చిత్తశుద్ధితో వారికి 10 శాతం రిజర్వేషన్లను పెంచుతూ అసెంబ్లీ సాక్షిగా తీర్మానం పంపినా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంద ని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని హర్షిస్తూ సత్తుపల్లి నియోజకవర్గంలోని పెనుబల్లి మండలం, గంగదేవిపాడు గ్రామంలో బంజారా,గిరిజన మహిళలలు వారి సాంప్రదాయ బంజారా వేషధారణ, నృత్యాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని గిరిజనులపై చిత్తశుద్ధితో ఈనెల 17వ తేదీన సీఎం కేసీఆర్ గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లను పెంచుతున్నట్లు ప్రకటించారని తెలిపారు. అసెంబ్లీ సాక్షిగా ఏకగ్రీవంగా గిరిజన రిజర్వేషన్ పై తీర్మానం చేసి పార్లమెంటుకు పంపినప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దానిని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తుంద ని విమర్శించారు. గిరిజనుల ఆర్థిక స్థితిగతులను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పు లేకపోయినా 10 శాతం రిజర్వేషన్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నప్పటికీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దానిని తొక్కి పడుతుందని ఆయన ఆరోపించారు

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :