సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : ఓబుల దేవర చెరువు మండలము సున్నం పల్లి గ్రామములో మొక్కజొన్న పంటను సాగుచేసిన రైతులు ఉరవకొండ మాబు మరియు ఉరవకొండ హుస్సేనప్ప అనే రైతుల పొలాలను శాస్త్రవేత్తలు సందర్శించారు. మొక్కజొన్న పంటలకు వేసే ఎరువులు వివరాలను రైతులందరికి తెలిపి అధిక దిగుబడి వచ్చేలా తగు జాగ్రత్తలు పాటించాలని శాస్త్రవేత్తలు కోరారు. ఇందులో భాగంగా పంట విత్తేటప్పుడు మరియు 30 రోజులకొకసారి 45 రోజులకొకసారి 60 రోజులకు ఒకసారి 35 కిలోల చొప్పున యూరియా వెయ్యాలని సూచించారు .150 కేజీలు ఎస్ ఎస్ పి మరియు 30 కేజీల ఎం ఓ పి దుక్కిలోనే వేయాలని రైతులకు సూచనలు ఇచ్చారు. అదే పొలంలో కత్తెర పురుగులను ఆశించిన మొక్కలను పరిశీలించి ఎమామెక్టిన్ బెంజోయేట్ 80 గ్రాములు ఒక ఎకరానికి వేసుకోవాలని సూచించారు లేదా క్లోరి ఫైర్ఫాస్ 500 ఎంఎల్ ఒక ఎకరానికి పిచికారి చేసుకోవాలని సూచించారు. ఈ కత్తెర పురుగు చివరి దశలో ఉన్నప్పుడు విషపు ఎరలను వాడాలని సూచించారు. తరువాత తిప్పేపల్లి గ్రామం నందు బి వెంకటరమణ నాయక్ అనే రైతు సాగు చేసిన మొక్కజొన్న పంటను పరిశీలించారు. ఈ పంటలో ఆకు ఎండు తెగులు గుర్తించారు. ఆకులపై పొడవైన బూడిద రంగుతో కూడిన ఆకుపచ్చ లేదా గోధుమ వర్ణపు మచ్చలు కనిపిస్తాయి. వీటి నివారణ కొరకు టిల్ట్ 200 ఎం ఎల్ లేదా మ్యాన్కో జబ్ 400 గ్రాములు పిచ్చికారి చేసుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కదిరి పరిశోధనా కేంద్రం నుంచి వచ్చిన ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ వేమన , సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ నీలిమ , సహాయ వ్యవసాయ సంచాలకులు కదిరి ఎస్.సత్యనారాయణ , మండల వ్యవసాయ అధికారి ఎస్ ఇలియాజ్ మహమ్మద్ , ఆర్.బి.కె ఇన్చార్జులు మరియు రైతులు పాల్గొన్నారు.
-----------------------
Admin