సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి : మఠంపల్లి మండల కేంద్రంలో గ్రామంలోని మెయిన్ రోడ్డులో ఉన్న పునీత శౌరి వారి చర్చి నుండి పాత ఆంధ్ర బ్యాంక్ ,గ్రామ బొడ్రాయి వరకు రోడ్డు చాలా అధ్వన్వo గా ఉండటం వలన రోడ్డు మీద నడిచే పాదచారులు వాహన దారులు చాలా ఇబ్బందులు పడుతు ఉన్న విషయాన్ని గమనించిన సర్పంచ్ మన్యం శ్రీనివాస్ రెడ్డి వెంటనే స్పందించి అభివృద్ధి లో భాగంగా ఈ రోడ్డు ను కూడా గ్రామ ప్రజల అభీష్టం మేరకు త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ఆయన ఆధ్వర్యలో సాగర్ సిమెంట్స్ సౌజన్యంతో నూతన సిమెంట్ రోడ్డు ను వెయ్యలనే తపనతో ఈ రోజు రోడ్డు ను పరిశీలించడం జరిగింది. ఈ సంద్భంగా సాగర్ సిమెంట్స్ యాజమాన్యం వారు మాట్లాడుతూ .అతి కొద్ది రోజుల్లో పనులు మొదలు పెడతామని సర్పంచ్ గారి అభీష్టం మేరకు త్వరగా పూర్తి చేస్తామని తెలిపారు. ఇట్టి కార్యక్రమంలో సాగర్ సిమెంట్స్ భాస్కర్ రెడ్డి మాజీ సర్పంచ్ కొండేటి సుధాకర్ రెడ్డి గ్రామ కో ఆప్షన్ మెంబెర్ వల్లపు దాస్ సురేష్ గౌడ్, శేఖర్ ,మహేష్, మరియు గ్రామ నాయకులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు
-----------------------
Admin