Sunday, 26 July 2026 10:00:53 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి వెంటనే పట్టాలు ఇవ్వాలి... - రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి

Date : 26 May 2023 12:04 AM Views : 547

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇంటి స్థలాలు ఇచ్చి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ జర్నలిస్టు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి ప్రభుత్వాన్ని కోరారు. గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గల అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు కోసం ఎంతో కృషిచేసి ప్రధాన పాత్ర పోషించిన జర్నలిస్టులకు ఉద్యమ సమయంలో సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. ఎంతోమంది వర్కింగ్ లో ఉన్న జర్నలిస్టులు ఇప్పటికీ సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో నివసిస్తూ నానా ఇబ్బందులు పడుతున్నారని ఎలాంటి వేతనాలు లేకుండా ప్రభుత్వ సేవ ప్రజాసేవ ఉచితంగా చేస్తున్న జర్నలిస్టుల సమస్యలు దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.ఇంతే కాకుండా ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో ప్రభుత్వ భూములలో ఇండ్లు నిర్మించుకొని ఉన్న జర్నలిస్టులకు దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారంగా ఆయా జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాలని కోరారు. అదేవిధంగా ఆయా స్థలాల లో ఇండ్లు నిర్మించుకునేందుకు గృహలక్ష్మి పథకాన్ని వర్తింపజేయాలని దీంతోపాటు అన్ని ప్రాంతాలలో జర్నలిస్టు భవనాలు ప్రెస్ క్లబ్లు నిర్మించాలని కోరారు.ఇంకా ప్రతి జర్నలిస్టు కుటుంబాన్ని దృష్టిలో ఉంచుకొని అన్ని ఆసుపత్రుల్లో చెల్లుబాటు అయ్యే విధంగా ఎలాంటి ఖర్చులు లేకుండా ఉండేలా హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు.ఈ సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ దుర్గం బాలు,సూర్యాపేట జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రామచంద్రరాజు, సూర్యాపేట పట్టణ అధ్యక్షుడు పడిసిరి వెంకట్ సూర్యాపేట పట్టణ కోశాధికారి తిరుపతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు....

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :