సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : గరిడే పల్లి మండలంలోని వెంకట్రాంపురంలో తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం గ్రామ కమిటీ ఆధ్వర్యంలో పని నైపుణ్యత పని విధానం అనే అంశంపై లేబర్ డిపార్ట్మెంట్ సుదర్శన్ 15 రోజులు క్లాసులు నిర్వహించడం జరిగింది .ఇవాళ లాస్ట్ రోజైనా సందర్భంగా ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ కామల్ల శ్రీను పాల్గొని మాట్లాడుతూ ఈ 15 రోజులు పని నైపుణ్యత పని విధానం నేర్చుకున్న తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం గ్రామ కమిటీ సభ్యులకు 15 రోజులు శ్రద్ద గా కార్మికులకు శిక్షణా తరగతులను ఇచ్చినటువంటి సుదర్శన్ సార్ కి హాలు అరేంజ్మెంట్ చేసిన రాజుగారికి ఈ గ్రామ సర్పంచి గాలి రామకృష్ణ గారికి విప్లవ ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది మిగతా గ్రామ కమిటీ సభ్యులు కూడా ఈ శిక్షణా తరగతులను ఏర్పాటు చేసుకొని పని నైపుణ్యత పని విధానం ఉంది పట్టా పొందాల్సిందిగా తెలంగాణ ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సోదరులకు తెలియజేయడం జరుగుతుందని ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు కామల్ల నవీన్ భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు కామల్ల శ్రీను తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు జాల నాగరాజు ఆరు వీరయ్య బి వెంకటేష్ బి రవి కే రామకృష్ణ రామకృష్ణ చారి జాల నాగేశ్వరరావు రాజు వీరబాబు జాల లక్ష్మి జల నాగమణి సిహెచ్ కోటేశ్వరమ్మ సిరిమల్లె నాగమ్మ ధనమ్మ గోపి ఏ వీరబాబు పెద్ద కోటేశ్వరమ్మ సోనీ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin