సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పెనుకొండ నియోజకవర్గం, గోరంట్ల మండలం, వానవోలు గ్రామపంచాయతీ, కొలింపల్లికి చెందిన టిడిపి నాయకులు వైసీపీలో చేరారు. వానవోలు గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీరాములు, ఉపసర్పంచ్ బుల్లెట్ బాబు, సింగిల్ విండో ప్రెసిడెంట్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి శ్రీ సత్యసాయి జిల్లా వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పెనుకొండ నియోజకవర్గ శాసనసభ్యులు మాలగుండ్ల శంకర నారాయణ వారి సమక్షంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 30 కుటుంబాలు వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. వారందరికీ ఎమ్మెల్యే కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల మండల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin