సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజుర్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హుజుర్ నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో కొంత మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు... ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ, ఎమ్మెల్యే సైదిరెడ్డి కి సంపూర్ణ మద్దతు తెలుపుతూ తెలంగాణ రాష్ట్రం,హుజుర్ నగర్ మరింత అభివృద్ధి చెందాలి అని ,ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కొనసాగాలని,అలాగే నియోజకవర్గ పరిధిలోని అన్ని పట్టణాలు, గ్రామాలు మరింత అభివృద్ధి చెందాలి అంటే బి ఆర్ ఎస్ పార్టీ తోనే, సైదిరెడ్డి తోనే సాధ్యం అని వారి పూర్తి మద్దతు తెలుపుతూ బీఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది. పార్టీలో చేరిన వారిలో శీలం వెంకన్న ఆరోగ్యమే మహాభాగ్యం ట్రస్ట్ అధ్యక్షులు, వేముల లక్ష్మణ్ రాజు వైఎస్ఆర్టీపీ పట్టణ యువజన సంఘం అధ్యక్షులు, వెంకటేష్ సోషల్ వర్కర్, బండారు రాము వైఎస్ఆర్టీపీ నాయకులు, గుంజ ఉపేందర్ వైఎస్ఆర్టీపీ యువజన సభ్యులు, గోనెల రామకృష్ణ, రాజబోయిన కమల్,మరియు గరిడేపల్లి మండలం పొనుగోడు,కీతవారిగూడెం గ్రామాలకు సంబంధించిన 25 మంది యువకులు, మేళ్లచెరువు తులసీరామ్, మా శెట్టి సాయి చరణ్ ,మీసాల నితిన్, రెడపంగు అచ్యుత్, నందిపాటి లోహిత్,గట్టు యశ్వంత్, కుక్కడపు వినయ్, చెనగాని సాయికుమార్, జుట్టుకొండ నవీన్, కుమ్మరి శ్రీను, దొంగరి రవి, పండు, మాశెట్టి అరుణ్, కీత అజయ్ తదితరులు ఉన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ, గ్రామ స్థానిక ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు కార్యకర్తలు,వారి అనుచరులు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin