సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : మక్తల్ మండలంలోని కర్ని గ్రామంలో హజరత్ మహబూబ్ సుభాని ఉర్సు ను పురస్కరించుకుని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో సందెపు రాళ్ళ పోటీలు నిర్వహించడం జరిగింది. కర్ని గ్రామ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తల సమన్వయంతో ఛత్రపతి శివాజీ మహరాజ్ చౌరస్తాలో నిర్వహించిన సందెపు రాళ్ళ పోటీలలో కర్ని గ్రామ యువకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్టి పోటిలలో ముగ్గురు అభ్యర్థులు ఉత్థిర్ణులయ్యారు. గెలుపొందిన విజేతలకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చేతుల మీదగా బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి శాపలి ఎల్లప్ప, రెండవ బహుమతి రాజమూరి రాజు గెలుపొందగా ముచ్చటగా మూడవ బహుమతి ఈడిగి నర్సిములు గౌడ్ గెలుపొందారు. ఈ సందర్భంగా ఈద భీమేష్ మాట్లాడుతూ... కర్ని గ్రామ యువకులు అన్ని రంగాలలో ముందంజలో ఉండాలన్నారు. మంచిగా చదుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు. మీ తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకురావాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దామ్మోళ్ల క్రిష్ణయ్య గౌడ్ మాజీ ఉపసర్పంచ్, ఈద బీమెష్, గాసం నరసింహ మత్స్యశాఖ సొసైటీ అధ్యక్షుడు, ఎద్దుల చిన్న హన్మంత్ , వాకిటి హన్మంత్, డి శ్రీను, నజిముద్దీన్, ఈద నాగరాజు, ఉప్పరి నవీన్, ఈద నెంబర్ కిష్టప్ప, ఏర్సన్ పల్లి రంగప్ప, శాపలి నరసింహ రైతు సోదరులు తదితరులు పాల్గొన్నారు...
-----------------------
Admin