సర్కార్ టీవీ న్యూస్ / శ్రీ సత్యసాయి జిల్లా : పుట్టపర్తిలో ఘనంగా సత్య సాయిబాబా 97వ జయంతి ఉత్సవాలు. ప్రశాంతి నిలయంలో సత్యసాయి యూనివర్సిటీ 41వ స్నాతకోత్సవం. విద్యార్థులకు బంగారు పతకాలు అందజేసిన ఇస్రో చైర్మన్.. శ్రీ సత్య సాయిబాబా 97వ జయంతోత్సవాల్లో భాగంగా ప్రశాంతి నిలయంలో నేడు సత్యసాయి యూనివర్సిటీ 41 జరిగింది ఈ కార్యక్రమానికి ఇస్రో చైర్మన్ సోమనాథ్,యూనివర్శిటీ చాన్సిలర్ హోదాలో చక్రవర్తి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బంగారు పతకాలను మెమొంటోలను అందజేశారు. 22 మంది విద్యార్థులకు బంగారు పతకాలు 17 మందికి పిహెచ్ డి లను ప్రదానం చేశారు. 486 మందికి ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం ఇస్రో చైర్మన్ సోమనాథ్ మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష పరిశోధనా రంగంలో ఇస్రో తన సత్తా చాటుతూ కలికితురాయిగా మారిందన్నారు. సత్యసాయి విద్యాసంస్థల్లో చదువుకున్న వారికి అపారమైన ఉద్యోగ అవకాశాలు వారు ఎంచుకున్న రంగాల్లో లభిస్తున్నాయని చెప్పారు.....
-----------------------
Admin