సర్కార్ టీవీ న్యూస్ / ఖమ్మం జిల్లా : జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవనంలో పి సి సి సభ్యుల,బ్లాక్/మండల/పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో సమీక్షా సమావేశం లో మరియు జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు మొక్కా శేఖర్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కిసాన్ సెల్ మండల అధ్యక్షులు,జిల్లా కార్యవర్గ సమావేశానికి,జిల్లా sc సెల్ అధ్యక్షులు బొడ్డు బొందయ్య అధ్యక్షతన జరిగిన మండల అధ్యక్షులు మరియు కార్యవర్గ సభ్యులతో జరిగిన సమావేశా నికి మరియు BC సెల్ అధ్యక్షులు పుచ్చకాయల వీరభద్రం అధ్యక్షతన జరిగిన మండల అధ్యక్షుల,కార్యవర్గ సమావేశానికి ముఖ్య అతిధిగా పాల్గొన్న జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ AICC ఆదేశానుసారం,TPCC అధ్యక్షలు శ్రీ రేవంత్ రెడ్డి మరియు CLP నేత భట్టి విక్రమార్క మల్లు గార్ల పిలుపు మేరకు రాహుల్ గాంధీ గారు చేసిన భారత్ జోడో పాదయాత్ర విజయవంతం అయినది జోడో యాత్రకు సంఘీభావంగా జరుగుతున్న హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ను రెండు(2)నెలల పాటు ప్రతి గడపకు వెళ్లి రాహుల్ గాంధీ గారి సందేశాన్ని ప్రతి ఒక్కరికి వివరిస్తూ రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తర్వాత తీయిసుకొనే నిర్ణయాలను వివరిస్తూ,కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న *హాత్ సే హాత్ జోడో పాదయాత్ర కార్యక్రమాన్ని విరివిగా చేయాలని,ఇప్పటివరకు అన్ని మండలాలలో హాత్ సే హాత్ జోడో పాదయాత్ర ఎన్ని గ్రామాలలో జరిగింది మండల కాంగ్రెస్ అధ్యక్షుల ద్వారా తెలిసికొని జరగని మిగతా గ్రామాలలో విరివిగా నిర్వహించాలని సూచించారు....ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు మహ్మద్ జావేద్ గారు రాయల నాగేశ్వరారావు గారు,పుచ్చకాయల వీరభద్రం గారు,బైరెడ్డి మనోహర్ రెడ్డి గారు,శీలం ప్రతాప్ రెడ్డి గారు,మాలోత్ రాందాస్ నాయక్ గారు జిల్లా నలుమూలల నుండి విచ్చేసిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,మండల కాంగ్రెస్ అధ్యక్షులు,పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు,జిల్లా కిసాన్ కాంగ్రెస్,ఓబీసీ,యస్ సి సెల్ మండల అధ్యక్షులు&కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
-----------------------
Admin