సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : ఫారూఖ్ నగర్ మండల్ / సమాజంలొ కుల ఆచార వ్యవహారాలను సంరక్షించుకునేందుకు ప్రజలు ఎల్లవేళల ఆధ్యాత్మికంగా సంసిద్ధంగా ఉండాలని, తద్వారా సంప్రదాయ వ్యవహారాలను ఎన్నటికీ మర్చిపోకూడదని కేశంపేట ఎంపీపీ వై రవీందర్ యాదవ్ అన్నారు. ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామంలో బీరప్ప దేవాలయంలో విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఆయన భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎంపీపీ రవీందర్ యాదవ్ నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికి సత్కరించారు ఆ బీరప్ప ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కురుమలు తరచూ ఇలాంటి ఉత్సవాలు జరపడం అభినందనీయమని తెలిపారు.అదే విధంగా బీరప్ప స్వామి పండుగకు పురాతన కాలం నుంచి ఎంతో ప్రాధాన్యత ఉందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గ్రామాల్లో ఆధ్యాత్మిక ధోరణి పెరుగుతోందని ఇది శుభసంకేతమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈటా గణేష్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin