Monday, 27 July 2026 12:44:54 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

గ్రామ పార్టీ నాయకులు నిర్ణయం మేరకే అభ్యర్థుల ఎంపిక ఎమ్మెల్యే దొంతి*

Date : 29 November 2025 06:09 PM Views : 235

సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట,ఖానాపురం మండలాలలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొని ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తోనే సాధ్యమని అన్నారు.గ్రామ పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ఎంపికను గ్రామ పెద్దలు,స్థానిక నాయకులు కలిసి చర్చించి ఖరారు చేయాలి. ఎక్కువ మంది పోటీదారులు ఉన్నా,అందరినీ కూర్చోబెట్టి గ్రామాభివృద్ధి సామర్థ్యం,ప్రజల ఆశీస్సులు,రిజర్వేషన్‌లను పరిగణలోకి తీసుకుని ఉత్తమ అభ్యర్థిని సర్పంచ్‌గా ఖరారు చేయండి. ????అదే విధంగా డిసెంబర్ 5న నర్సంపేటకు సీఎం రేవంత్ రెడ్డి గారు విచ్చేయనున్నారని,సీఎం గారి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ????నర్సంపేట నుండి వరంగల్ వరకు 4 లైన్ల రహదారికి మరియు మెడికల్ కాలేజీ బిల్డింగ్,ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్ నిర్మాణం శంకుస్థాపన, దుగ్గొండి మండలం తొగ్గరాయి R&B రోడ్డు నుండి పొనకల్ వరకు డబల్ రోడ్డు నిర్మాణం కోసం కూడా శంకుస్థాపన చేయనున్నారని వీటితో పాటు పాఖాల చెరువు ఆయకట్టు మరమ్మత్తులు మరియు కాలువల నిర్మాణం తదితర అభివృద్ధి పనులకు సీఎం గారు శంకుస్థాపన చేస్తారని అన్నారు. ???? గ్రామాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తల సమన్వయం కొరకు మండలాల వారీగా ఇంచార్జీలను కూడా నియమించామని,అందరూ సమిష్టిగా ఉండి పార్టీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

-----------------------

కుమారస్వామి 9866079950

Reporter

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :