సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ మండలం చేగూరు గ్రామం నుండి పెద్ద ఎత్తున టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అంజయ్య యాదవ్ కు మద్దతుగా తరలివచ్చారు. ఇటీవల నందిగామ ఎంపీపీ ప్రియాంక, కొత్తూరు మాజీ ఎంపీపీ శివ శంకర్ గౌడ్ లు టిఆర్ఎస్ పార్టీ నుండి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాగా శుక్రవారం ఉదయం నందిగామ మండలం ఉమ్మడి చేగూర్ గ్రామం నుండి భారీ ఎత్తున కార్యకర్తలు అంజయ్య యాదవ్ ని కలిసి తమ పూర్తి మద్దతు తెలియజేశారు. నాయకులు ఎటువైపు పోయినా అభివృద్ధి బాటలోనే తమంతా పనిచేస్తామని టిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల్లో భారీ మెజార్టీ వచ్చే విధంగా అహర్నిశలు కృషి చేస్తామన్నారు. స్వచ్ఛందంగా గ్రామం నుండి వచ్చిన కార్యకర్తలను చూసిన అంజయ్య యాదవ్ వారికి అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. తెలంగాణ అన్ని రంగాల్లో దినదినాభివృద్ధి చెందుతుందని, అధికారాన్ని అనుభవించిన కొందరు పార్టీని వీడితే పార్టీకి ఏ మాత్రం నష్టం వాటిల్లదని ఆయన అన్నారు. నాయకులను తయారు చేసేది కార్యకర్తలే నని ప్రజలకు సేవ చేసే వారిని నాయకుడిగా ఎన్నుకోండని పిలుపునిచ్చారు.
-----------------------
Admin