సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగియడం పట్ల సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఎస్ వెంకట్రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ఎలక్షన్ కోడ్ విడుదలైన దగ్గర నుంచి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ఎన్నికల నిర్వహణలో సూర్యాపేట జిల్లా ప్రజల సహాయ సహకారాలు భాగస్వామ్యం మరువలేనిది అని ఎన్నికలు ప్రశాంతంగా సజావుగా నిష్పక్షపాతంగా నిర్వహించడంలో సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియజేశారు. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహించడం ఎంతో అభినందనీయమని ఎన్నికల నిర్వహణలో భాగస్వాములైన ఎన్నికల అధికారులకు మరియు సూర్యాపేట జిల్లాలోని పలు గ్రామాల ప్రజలకు ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రజలు అధికారులు ప్రజాప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు
-----------------------
Admin