సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం: గొత్తి కోయల దాడిలో ఫారెస్ట్ రేంజ్ అధికారి శ్రీనివాసరావు హత్యకు గురికావడం దారుణమని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.గురువారం పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోడు భూముల సమస్యను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం కావడం వల్లే అటవీ అధికారులు,గిరిజనుల మద్య నిత్యం చిచ్చు రేగుతోందని,ప్రభుత్వం చేతగానితనంతో నిజాయితీ పరుడైన ఒక అధికారి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని."ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే"దీనికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని,2018 ఎన్నికల ముందు గిరిజనుల ఓట్ల కోసం పోడు భూముల సమస్యను పరిష్కరిస్తామంటూ ఇచ్చిన హామీని ఆ తర్వాత అటకెక్కించారని మండిపడ్డారు.పోడు సమస్య పరిష్కారానికి మంత్రి సత్యవతిరాథోడ్ చైర్ పర్సన్ గా కమిటీని ఏర్పాటు చేసి 14 నెలలు గడిచిన ఇంతవరకు అతీగతీ లేదన్నారు.కేసీఆర్ ప్రభుత్వం పోడు భూముల అంశంపై గడిచిన 8 ఏళ్లుగా చూపిస్తున్న నిర్లక్ష్యం సరైంది కాదన్నారు.విధులు నిర్వహిస్తున్న అటవీ అధికారులకు భద్రత కల్పించి వారి డిమాండ్లనూ పరిగణనలోకి తీసుకోవాలన్నారు. యుద్ధ ప్రతిపాతిపదికన పోడు భూములకు పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేయాలని,లేని పక్షంలో బీఎస్పీ తరుపున ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు ఈకార్యక్రమంలో సాయి,చేనిగారపు నిరంజన్ కుమార్,ఆకుతోట పవన్ కళ్యాణ్, ధనుంజయ్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin