సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ టౌన్ మిర్యాలగూడ రైల్వే స్టేషన్ లో కమలాకర్ బాబు డివిజనల్ కమర్షియల్ మేనేజర్ గుంటూరు.... ఆధ్వర్యం లో గురువారం యూటిఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా టికెట్ తీసుకునే విధానం పైన రైల్వే ప్రయాణీకులకు అవగాహన కల్పించారు. క్యూ లైన్ లో నిలబడాల్సిన అవసరం లేకుండా,యూటిఎస్ మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరితగతిన టికెట్ తీసుకొని రైలు ప్రయాణం చేయ వచ్చునని అయన ప్రయాణీకులకు తెలిపారు. అంతే గాకుండా ప్రతీ రైల్వే స్టేషన్ లో క్యూ ఆర్ కోడ్ సదుపాయం ఉందని, ప్రయాణీకులు నగదు రహిత ప్రయాణం చేసుకోవడానికి రైల్వే వెసులుబాటు కల్పించిందని తెలియజేశారు. మొబైల్ టికెటింగ్ అప్లికేషన్ మరియు నగదు రహిత టికెటింగ్ విధానం పైన ప్రయాణీకులకు ఉన్న సందేహాలను నివృత్తి చేశారు.ఈ అవగాహన కార్యక్రమ లో పాల్గొన్న ప్రయాణీకులు మొబైల్ అప్లికేషన్ ద్వారా త్వరగా టికెట్ తీసుకునే అవకాశము ఉందని మరియు నగదు రహిత టికెటింగ్ పట్ల ప్రయాణికులు హర్షం వ్యక్తం చేశారు.ఇట్టి అవగాహన కార్యక్రమం లో నల్గొండ సెక్షన్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ సతీష్, మిర్యాలగూడ కమర్షియల్ సూపర్వైజర్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin