సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : బూర్గంపాడు మండలం సారపాక లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలో ఐ ఎన్ టి యు సి రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ శంకర్ నాయక్ మాట్లాడుతూ ఐటీసీ కర్మాగారాన్ని సింగరేణికి అప్పజెప్పాలని అదే చక్కని పరిష్కారం అని డిమాండ్ చేశారు. పదివేల కోట్లతో సింగరేణి అభివృద్ధి బాటలో నడుస్తూ ఉందని ఐటీసీ కర్మాగారానికి సింగరేణి నుండే బొగ్గు సరఫరా జరుగుతుందని తెలియజేశారు. గ్రామాభివృద్ధిని పక్కనపెట్టి కేవలం ఐటిసి కర్మాగారం మాత్రమే అభివృద్ధి చెందుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి కర్మాగారం కొత్తగూడెం మణుగూరు తదితర ప్రాంతాలలో చక్కగా అభివృద్ధి చెందుతుందని కార్మికులు కూడా సింగరేణి తో పాటు అభివృద్ధి చెందుతున్నారని ఐటీసీ కర్మాగారాన్ని సింగరేణికి అప్పజెప్పి వారి ఆధ్వర్యంలో నడపాలని డిమాండ్ ను శంకర్ నాయక్ చేశారు. త్వరలోనే భారీ బహిరంగ సభ ఉంటుందని ఆ సభకు రేణుక చౌదరి హాజరు అవుతారని తెలియజేశారు. ఐటీసీ కర్మాగారం ఈ ప్రాంత ప్రజల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నారని అనేక రకాలుగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఐటిసి వారికి సహకారం అందించారని తెలియజేశారు. శుక్రవారం జరిగిన ఐటిసి పబ్లిక్ హీరింగ్ పోలీసు నిర్బంధంలో జరిగిందని అలా ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. మాజీ సర్పంచ్ చందు నాయక్ ని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నరాల సత్యనారాయణ ఒక జర్నలిస్టుని ఒక గిరిజన మహిళలు పలువురిని అరెస్టు చేసి నిర్బంధంతో ప్రజాభిప్రాయ సేకరణ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఐటిసిని ప్రశ్నించారు. స్థానిక సర్పంచులకు ఇతర నాయకులకు ముందే మంతనాలు జరిపి వారిని మభ్యపెట్టి పబ్లిక్ హీరింగ్ పోలీస్ పహారాలో జరపటాన్ని తప్పు పట్టారు. ఏదేమైనా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఐటీసీ కర్మగారాన్ని జాతీయం చేయాలని ప్రధాన డిమాండ్ ను ఆయన చేశారు. సెవెంత్ ప్లాంట్ లో ఇచ్చిన ఉద్యోగ ఉపాధి హామీలను ఐటిసి నిలబెట్టుకుని ప్రశ్నించారు. ప్రైవేటు సంస్థ కంటే ప్రభుత్వ సంస్థ ఐటీసీ నడపడం ఎంతో శ్రేయస్కరమని పేర్కొన్నారు.
-----------------------
Admin