సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : పోడు రైతులతో కలెక్టర్ కార్యాలయం వద్దకు పాదయాత్రతో పోడు రైతులు వచ్చి ధర్నా నిర్వహించడం జరిగింది.... ఉమ్మడి రేగళ్ల పంచాయతీలో పరిధి లో గిరిజన రైతులకు సర్వేలు చేసి 350 పట్టాలు ప్రభుత్వం తయారుచేసి మంత్రి హరీష్ రావు సమక్షంలో జులై 30న 40 మంది రైతులకు పంచి, మిగతా పట్టాలు ఈరోజు వరకు ప్రభుత్వం పంపిణీ చేయలేదు దుబ్బ తండా దూదియా తండా పంచాయతీల్లో సర్వే చేసి 550 మంది రైతులకు పట్టాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది దీన్ని ప్రభుత్వం తక్షణమే పట్టాలు పంపిణీ చేయాలి లేనియెడల పోడు రైతులు ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని అయిలయ్య పిలుపునిచ్చారు. సోమవారం ఉమ్మడి రేగళ్ల పంచాయతీలో గిరిజన రైతులకు పోడు పట్టాలు ఇవ్వాలని రేగళ్ల క్రాస్ రోడ్డు నుండి కలెక్టరేట్ వరకు పాదయాత్రగా వెళ్లి కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ధర్నా ఉద్దేశించి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాని ఐలయ్య, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర నాయకులు అన్నవరపు కనకయ్య, తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ లు మాట్లాడుతూ కొన్ని సంవత్సరాలుగా గిరిజన రైతులను మోసం చేస్తున్న రేగళ్ల ధరపై ఫారెస్ట్ ప్రభుత్వ భూమి అని తెలిసి గిరిజన రైతులకు 1150 ఎకరాలు సుమారు 45 సంవత్సరాల క్రితం అమ్ముకొని సొమ్ము చేసుకున్నాడు నాటి నుండి నేటి వరకు అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఫారెస్ట్ భూమిని తెలిసినా ప్రభుత్వ అధికారులు జిల్లా కలెక్టర్ ఈరోజు వరకు రేగళ్ల దొరపై మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఫారెస్టు రెవెన్యూ జాయింట్ సర్వే చేసి ఫారెస్ట్ భూమిని హద్దులు నిర్ణయించిన అధికారులు ఈరోజు వరకు భూమి మీద గిరిజన రైతుల సాగు చేసుకుంటున్నారు అమాయక గిరిజనులతో పాటు ప్రభుత్వాన్ని కూడా మోసం చేసి తన దగ్గర భూమి లేకపోయినా రేగళ్ల దొర రైతు బందు తీసుకుంటున్నారు అమాయక గిరిజన రైతులను ప్రభుత్వాన్ని మోసం చేసిన రేగళ్ల దొరపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గిరిజన రైతులకు తక్షణమే సర్వే చేసిన భూమికి తయారైన పట్టాలు పంపిణీ చేయాలని జిల్లా అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఉప్పనపల్లి నాగేశ్వరరావు తెలంగాణ రైతు సంఘం మండల కార్యదర్శి వాంకుడోత్ కోబాల్ అమర్ సింగ్ భూక్య బాలకృష్ణ సాయిరాం వెంకన్న కిషన్ ధరావత్ వెంకన్న సూర్య కుమార్ రమేష్ విజయ్ ధరావత్ బాలాజీ భానోత్ మల్సూర్ మురళి సేవలు హరిదాస్ లాల్ సింగ్ హతిరాం తదితరులు 150 మంది రైతులు పాల్గొన్నారు
-----------------------
Admin