సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : సర్కార్ న్యూస్ నర్సంపేట గుంతలతో నిండిన రోడ్లను త్వరగా నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డా|| గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన మరియు మహా ధర్నా నర్సంపేట పట్టణంఇటీవల కురిసిన వర్షాల కారణంగా మాదన్నపేట రోడ్డు నుండి అనేక గ్రామీణ, రహదారులు పాడైపోయి, గుంతలు ఏర్పడి, ప్రయాణికులు ప్రమాదాల బారిన పడుతున్నారని నిరసన ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అధికారులు వెంటనే స్పందించి రోడ్ల మరమ్మతులు చేపట్టి నిర్మించాలని వారు డిమాండ్ చేశారు. ప్రధాన సమస్యలు: గుంతలమయం: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లపై కంకర తేలి, గుంతలు ఏర్పడ్డాయి. ప్రమాదాలు: గుంతలతో ఉన్న రోడ్లపై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి, ప్రయాణ ఇబ్బందులు: రోడ్లు బురదమయంగా మారడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. నిధులున్నా పనులు లేవు: రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరై పనులు ముందుకు సాగడం లేదని ఆరోపణలు ఉన్నాయి. అమృత్ పథకం కింద 32 కోట్లు నర్సంపేట మున్సిపాలిటీ అభివృద్ధికి వచ్చిన నిధులు మరియు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు కేటాయించి క్లీన్ సిటీగా ఏర్పాటుకు నిధులు మంజూరు చేస్తే 52 కోట్ల అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నించారు వారం పది రోజుల్లో మీరు ఈ రోడ్డును తాత్కాలిక మరమ్మత్ చేయని యెడల బిజెపి ఆధ్వర్యంలో మా సొంత డబ్బులతో తాత్కాలిక మరమ్మతు చేపట్టడం జరుగుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కు సవాల్ విసరడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ వడ్డేపల్లి నరసింహారాములు,జిల్లా ఉపాధ్యక్షులు రేసు శ్రీనివాస్,పార్లమెంట్ కో కన్వీనర్ కట్ల రాంచందర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు గూడూరు సందీప్,నర్సంపేట మండల అధ్యక్షులు తనుగుల అంబేద్కర్,జిల్లా కౌన్సిల్ మెంబర్స్ ,ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు,పట్టణ మరియు రూరల్ ప్రధాన కార్యదర్శులు,వివిధ మోర్చాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు….
-----------------------
Reporter