సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్, కేశంపేట్ మండల్ / గ్రామాల్లో ప్రతి వ్యక్తికి ఆధ్యాత్మికతయే జీవత పరమావధి కావాలని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట మండలం చింతకుంట పల్లి గ్రామంలో హనుమాన్ దేవాలయం నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమంతో పాటు నవగ్రహ ప్రతిష్టాపన ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా శంకర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు ప్రజలు శంకర్ కు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పలువురు శంకర్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వీరేశప్ప, మహిళా అధ్యక్షురాలు అనసూయ, యూత్ కాంగ్రెస్ అందే మోహన్, యూత్ కాంగ్రెస్ నరేందర్, నందిగామ ఎంపీటీసీ కొమ్ము కృష్ణ, తుమ్మల గోపాల్, సీతారాములు, మనోజ్ రెడ్డి, గ్రామ పెద్దలు శ్రీధర్ రెడ్డి, నర్సింలు యాదవ్, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ జనరల్ సెక్రెటరీ రమేష్ యాదవ్, మల్లేష్ యాదవ్, కృష్ణ యాదవ్, రమేష్, నరేష్, రాజు,నవీన్, వంశీ, నవీన్, సాయి,అశోక్,శివ, రావుల పెంటయ్య, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin