సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం (అర్బన్ ): కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలోని చిట్టి రామవరం లో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవాలయలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆరవ రోజు భక్తులకు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవి అవతారంలో దర్శనమిచ్చారు .అత్యంత కనుల పండుగగా జరిగే నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చిట్టి రామవరం గిరిజనులు వారి సాంప్రదాయ నృత్యాలతో ఊరేగింపుగా అమ్మవారి దేవాలయానికి చేరుకొని 108 రకాల పిండి వంటలను ,స్వీట్లు అమ్మవారికి నైవేద్యంగా ఊరేగింపుగా తెచ్చిన అరటి ఆకులలో సమర్పించారు. .ఈ సందర్భంగా 11వ వార్డు కౌన్సిలర్ భూక్య శ్రీనివాస్ మాట్లాడుతూ మా ప్రాంత ప్రజలను చల్లంగా చూడాలని, పాడిపంటలు రైతులకు లాభదాయకంగా పండేటట్లు చూడాలని అమ్మవారిని కోరుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టి రామవరం మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బాల ,రాంబాబు, భీముడు ,భావ్ సింగ్, రాము, రాంప్రసాద్ ,నగేష్ అమ్మవారి మాలదారులు కావేరి ,గంగా ,విజ్జి, లక్ష్మి ,బుల్లి ,రంగమ్మ దేవి ,రజిత, మంగ, పద్మ, రంకు, కృష్ణవేణి సరోజ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin