సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు: మండలంలోని జానపహాడ్ సైదులు దర్గా ఉర్సు ఉత్సవాలలో బహుజన్ సమాజ్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి రాపోలు నవీన్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూబహుజనుల ఆరాధ్య దైవం అయిన జానపహాడ్ సైదులు దర్గా ఉర్సు ఉత్సవాలలో పాల్గొనడం సంతోషంగా ఉంది అని , హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు అని,భక్తులు కొన్ని అసౌకర్యాల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నరు అని ఈ విషయం ను దృష్టిలో పెట్టుకొని జానపహాడ్ సైదన్న సన్నిధి అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజేంగ్ సెక్రటరీ పెద్దపంగ ఉపేందర్, నియోజకవర్గ అధ్యక్షులు జిలకర రామస్వామి,పట్టణ అధ్యక్షులు కర్రీ సతీష్ రెడ్డి, మండల అధ్యక్షులు సురేష్ బాబు, తకెళ్ళ నాగార్జున అమరవరపు వెంకటేశ్వర్లు, బొజ్జా పవన్,బచ్చలకూరి నవీన్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin