సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లో కొత్త ఉత్సాహంతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ అన్నారు. కొందుర్గు మండలంలోని టేకులపల్లి గ్రామం నుండి టిఆర్ఎస్, బిజెపి పార్టీల నుండి దాదాపు 30మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్. పార్టీలో చేరిన వారిలో నర్సింలు, రాజు, శ్రీశైలం, మల్లేష్, రమేష్, మహేందర్, బుగ్గరాములు, లక్ష్మయ్య, శ్రీకాంత్, రమేష్, లింగం, రాకేష్, రమేష్, రామచందర్, రామ్ చరణ్, శ్రీకాంత్, శేఖర్, శ్రీను, మల్లేష్, రఫీక్, శ్రీకాంత్, తదితరులు ఉన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారిని ఉద్దేశించి వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని అన్నారు. ఈ రెండు నెలలు జాగ్రత్తగా ఉంటే ఐదేళ్లు కాంగ్రెస్ పార్టీ రాజ్యమని అన్నారు. గ్రామాల్లో సంక్షేమ పథకాలు అభివృద్ధి పేరిట ప్రజా దోపిడి జరుగుతుందని అభివృద్ధిని విస్మరించారని తాత్కాలిక ఉపశమనం చేస్తూ శాశ్వత అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, చిలకామారి మాజీ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, కొందుర్గు మండలం వైస్ ప్రెసిడెంట్ ఫైల్ మాన్, బీసీ సెల్ అధ్యక్షులు మంత్రి మల్లేష్, బుద్వేల్ నరసింహారెడ్డి, శశివర్ధన్ రెడ్డి, ఎస్సీ సెల్ శేఖర్, అయ్యప్ప, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin