సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ పట్టణంలోని భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు గడ్డం రాజశేఖర్ పాల్గొని ముందుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించి అనంతరం నాయకులు మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం ఇవ్వాలంటే మీకంటూ రాజ్యాంగం ఉండాలని బ్రిటిష్ వారు ఎద్దేవా చేసిన క్రమంలో అనేక దేశాలు తిరిగిన ఎవ్వరు కూడా భారతదేశానికి రాజ్యాంగం రాయలేని స్థితిలో రాజ్యాంగ నిపుణులైనటువంటి ఇంగ్లాండుకు చెందిన మేధావి భారత రాజ్యాంగం రాయాలంటే అది కేవలం భారతదేశంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ద్వారానే సాధ్యమవుతుందని తెలిపిన క్రమంలో అనేక కులాలు అనేక మతాలు అనేక భాషలు అనేక ప్రాంతాలు ఉన్నటువంటి భారతదేశానికి ప్రపంచ దేశాలే నివ్వరపోయేలా లిఖితపూర్వకమైన రాజ్యాంగం అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి శ్రమ ఎనలేనిదని వారిని స్మరించుకోవడం భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కాప శ్రీనివాస్, పాల్వంచ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు హెచ్చు మధు,జిల్లా విద్యార్థి నాయకుడు అజ్మీరా సురేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin