Monday, 27 July 2026 09:39:43 AM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

డిచ్పల్లి మండల కేంద్రంలో వరి ధాన్య కొనుగోలు ప్రారంభం...

Date : 02 November 2022 12:28 AM Views : 453

సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : డిచ్పల్లి మండల కేంద్రంలో.. వరి ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభోత్సవం చెయ్యటానికి ముఖ్య అతిథులుగా.. ఎమ్మెల్సీ గౌడ్ విచ్చేసి, కమలాపూర్, మిట్టపల్లి తాండ,రాంపూర్ తదితర గ్రామాల్లో వరికోనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. వరిధాన్య కొనుగోలు కేంద్రాల భాగంగా.. ఉమ్మడి జిల్లాల ఐ డి సి ఎం ఎస్ చైర్మన్ సాంబార్ మోహన్, ధర్పల్లి జెడ్పిటిసి బాజిరెడ్డి జగన్మోహన్, సొసైటీ చైర్మన్ తారాచంద్ నాయక్ పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్సీ విజి గౌడ్ సందర్భంగా.. మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కెసిఆర్ అమలు చేసిన రైతు భీమా, రైతు బంధు, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు, మిషన్ భగీరథ, కాలేశ్వరం ప్రాజెక్ట్ వంటి మరెన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెట్టాడని కొనియాడారు. వరి కొనుగోలు ఏ గ్రేడ్ రకానికి 2060 రూపాయలు, బి గ్రేడ్ 2040 రూపాయలు నాణ్యమైన ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రానికి తెస్తే రైతుకు అనుకున్నంత గిట్టుబాటు ధర లభిస్తుందని అన్నారు. ప్రతి రైతు గ్రామ గ్రామాన దళారుల చేతిలో మోసపోవద్దని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని, సకాలంలో డబ్బులు తమ అకౌంట్లో జమ అవుతాయని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా డిచ్పల్లి జడ్పిటిసి ఇందిరా లక్ష్మీ నరసయ్య, సొసైటీ డైరెక్టర్లు, గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, రైతులు, నాయకులు, పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :