సర్కార్ టీవీ న్యూస్ / వరంగల్ జిల్లా : నర్సంపేట నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలోని మాధన్నపేట చెరువులో చేప పిల్లలను చేప పిల్లలను జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద తో కలిసి విడుదల చేశారు.మొత్తం 6 లక్షల 81 వేల చేప పిల్లలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని పెద్ద చెరువైన మాధన్నపేట మత్స్య సహకార సంఘంలోని ప్రతీ సభ్యుడు చేపల పెంపకం లో నైపుణ్యం పెంపొందించుకొని ప్రైవేట్ వ్యక్తులకు చేపల ఉత్పత్తిని అప్పగించకుండా వారే నిర్వహించాలని కోరారు. మొత్తం 11 లక్షల 50 వేల విలువైన చేప పిల్లలు విడుదల చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో డీఆర్డీఓ రాంరెడ్డి , మత్స్యశాఖ జిల్లా అధికారి శ్రీపతి ,మార్కెట్ చైర్మెన్ పాలాయి శ్రీనివాస్,పిఎసిఎస్ చైర్మన్ రమణారెడ్డి,తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Reporter