సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : అశ్వాపురం మండలం కేంద్రాల్లో ఈనెల 28 నా జరగనున్న పినపాక నియోజకవర్గ మహాసభల కరపత్రాలులను పినపాక ఎమ్మెల్యే రేగాకాంతారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి ముందుకు దూసుకెళ్తుందన్నారు చేసే అభివృద్ధిని సంక్షేమ ఫలాలను ప్రజలకు విస్తృత ప్రచారం చేసింది మీడియా మాత్రమే అని మీడియా సమాజహితం కోసం నిరంతరం పాటుపడుతున్నారు జర్నలిస్టులకు ప్రభుత్వం వద్ద పెండింగ్ లో ఉన్న సమస్యలను తీర్చేలా కృషి చేస్తా అన్నారు త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా చేస్తా అన్నారు తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పినపాక నియోజకవర్గం మహాసభలు అశ్వాపురంలో జరగనున్న సందర్భంగా సభలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కర్రి అనిల్ రెడ్డి రాష్ట్ర కార్యవర్గ వెలమ రాజేందర్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ములకలపల్లి గోపీనాథ్ కొనటి నరసింహారావుతదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin