సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మించాలని షాద్ నగర్ పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ప్రజా సంఘాలు ప్రతి పక్ష పార్టీల అధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్ష శిబిరం వద్దకు ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ టీపీసీసీ రాష్ట ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ హాజరై ప్రసంగించారు. లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన పాలకులు ఇప్పుడు దాని ఊసే లేకుండా చేశారని లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించి చరిత్రలో మిగులుతారా లేదా లక్ష్మిదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించాకుండ చరిత్రలో స్థానం లేకుండా మిగిలిపోతారా అంటూ ప్రసంగించారు మీరు గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలలో బాగంగానే మాత్రమే ప్రజలు అడుగుతున్నారని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మించే వరకు ప్రజాసంఘాలు ప్రతిపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు కొనసాగుతూనే ఉంటాయని అన్నారు. శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేస్తామని అధికార పార్టీ నేతలు కూడా సానుకూలంగా స్పందించి లక్ష్మీదేవి పల్లె రిజర్వాయర్ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు లేదంటే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమే లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ రంగారెడ్డి జిల్లా చైర్మన్ చల్లా శ్రీకాంత్ రెడ్డి, రాందాస్, వెంకటరెడ్డి రాములు రమేష్ గౌడ్ సతీష్ పటేల్ వెంకట్ నర్సిహారెడ్డి, రాజు, శ్రీను కాంగ్రెస్ నాయకులు బాబర్ ఖాన్, బాల్ రాజ్ గౌడ్ రఘు, పురుషోత్తంరెడ్డి , బాదేపల్లి సిద్ధార్థ, కొమ్ము కృష్ణ, బుడ్డ నరసింహ, అంజి యాదవ్ నర్సింలు, సంతోష్ గౌడ్, నవీన్ గౌడ్, సురేష్ గౌడ్, రమేష్, గణేష్, ప్రజా సంఘాల నాయకులు రవీంద్రానాథ్ తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin