సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండలం పుల్చెర్ల కుంట తండాకు సంబందించిన యువత లింగం నాయక్, శ్రీను నాయక్ అధ్యక్షతన బిజెపి చేరారు. ఈ సందర్బంగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి షాద్ నగర్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జి సూర్యనారాయణ, అసెంబ్లీ కన్వీనర్ డాక్టర్ టంగుటూరి విజయ్ కుమార్, పాతపల్లి కృష్ణా రెడ్డి, మనోహర్ రెడ్డి వారిని కండువాతో బిజెపి లోకి స్వాగతించారు. ఈ సందర్బంగా నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో కాంగ్రెస్ పార్టీ 60 ఏళ్ల పరిపాలన లో గిరిజన తండాల అభివృద్ధి లేక, సరైన వసతులు లేక ఎంతో ఇబ్బందులపాలయ్యారని అన్నారు. అదేవిదంగా తొమ్మిదిన్నర ఏళ్లలో గిరిజన తండాలు అభివృద్ధి చేయడం లో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని అన్నారు. ఎన్నికలప్పుడే ఓట్ల కోసం గిరిజనబంధు గుర్తుకొస్తుందని విమర్శించారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ అని చెప్పి ఇవ్వలేదని విమర్శలు గుప్పారు. గిరిజన మహిళ ధ్రౌపతి ముర్ము గారిని రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీదే అని అన్నారు. గిరిజనుల కోసం సమ్మక్క సారక్క యూనివర్సిటీ ఇచ్చారని అన్నారు. తాండలలో వీధి లైట్లు, సీసీ రోడ్లు వివిధ అభివృద్ధి పనులు కేంద్రప్రభుత్వ నిధులతోనే జరుగుతున్నాయని అన్నారు. గిరిజన తండాల అభివృద్ధి బిజెపి తోనే సాధ్యమని, గిరిజన తాండాల సమగ్ర అభివృద్ధి కి కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. కాంగ్రెస్, టిఆర్ఎస్ ఇచ్చే అబద్దపు హామీలను నమ్మి మోసపోవద్దని అన్నారు. నవంబర్ 30 న జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో గిరిజనులు బిజెపికి మద్దత్తు ఇవ్వాలని, అందె బాబయ్యని భారీ మెజారిటీ తో గెలిపించాలని కోరారు. ఇందులో భాగంగా గోవింద్ నాయక్, వినోద్ నాయక్, మురళి నాయక్, పవన్ నాయక్, ఎం వినోద్ నాయక్, నరేష్ నాయక్, సురేష్ నాయక్, కుమార్ నాయక్, ప్రభాకర్ నాయక్, ప్రకాష్ నాయక్, శివ నాయక్, వీరేష్ నాయక్, అర్జున్ నాయక్, సురేష్ నాయక్ తదితరులు పార్టీ లో చేరారు.
-----------------------
Admin