సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని నియోజకవర్గాలలో ఎమ్మెల్యేల ఇల్లు ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది హుజూర్ నగర్ నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు బొబ్బా భాగ్యరెడ్డి ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు ఇంటి రవి ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థానిక శాసనసభ ఎమ్మేల్యే క్యాంప్ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించి అక్రమ కేసులు నమోదు చేయడం జరిగింది.అర్హులైన నిరుపేదలందరికీ ఈ రాష్ట్ర ప్రభుత్వం డబల్ బెడ్ రూమ్ లు ఇస్తానని చెప్పి 9 సంవత్సరాలు పూర్తయిన ఇప్పటివరకు నిరుపేదలకు ఆ డబల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేయలేదు దీనిలో భాగంగానే అర్హులైన నిరుపేదలందరి కుటుంబాల పక్షాన భారతీయ జనతా పార్టీ నిరంతరం పోరాటం చేస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబిసి మోర్చా అధ్యక్షులు అంబళ్ళ నరేష్ గౌడ్,జిల్లా కార్యదర్శి గుండె బోయిన వీరబాబు,జిల్లా అధికార ప్రతినిధి పత్తిపాటి విజయ్, జిల్లా ఓబిసి మోర్చా కార్యవర్గ సభ్యులు గంగినేని రామకృష్ణ, అసెంబ్లీ కన్వీనర్ వేముల శేఖర్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు ఇంటి రవి,మండల అధ్యక్షులు కుందూరు కోటిరెడ్డి, మేళ్లచేరువు మండల అధ్యక్షులు కీత శ్రీను, నేరేడుచర్ల మండల అధ్యక్షులు పార్తన బోయిన విజయ్, గరిడేపల్లి మండల ప్రధాన కార్యదర్శి జెనిగల శ్రీనివాస్,గుండా గోపి, ఉమా మహేశ్వరరావు, వల్లపుదాసు గోపి,ప్రవీణ్,సోమయ్య,మందా వెంకటేశ్వర్లు,వీరబాబు, చిట్టా నాగిరెడ్డి,నాయకులు,కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin