Monday, 27 July 2026 05:31:29 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

నాగార్జున సాగర్ ఎస్సీ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేయండి... - కందగట్ల అనంత ప్రకాష్, సిపిఎం మండల కార్యదర్శి

Date : 02 February 2024 08:05 AM Views : 362

సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలక వీడు : రైతుల ఆందోళన ఫలితంగా సాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన ప్రభుత్వం నేరుగా ఖమ్మం జిల్లా ప్రజల తాగునీటి అవసరాల కోసం నేరుగా పాలేరు రిజర్వాయర్ నింపడానికి తీసుకువెళ్లటం అన్యాయమని రిజర్వాయర్ నింపడంతో పాటు సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టు రైతాంగం బోర్లు బావులను ఆధారం చేసుకుని వరి పంట వేలాది మంది రైతులు వేసినారని పెద్ద ఎత్తున రైతులు ఖర్చుపెట్టి వరి వేస్తే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు బావులు ఎండిపోయి వేసిన వరి పంటలు ఎండిపోయే ప్రమాదశలో ఉన్నాయని కావున సాగర్ ఎడమ కాలువ కింద ఉన్న చెరువులు కుంటలు నింపటానికి నీటిని విడుదల చేయాలని సిపిఎం పార్టీ పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ డిమాండ్ చేశారు పాలకీడు మండల కేంద్రంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ ముఖ్యంగా హుజూర్నగర్ నియోజకవర్గం లోని సాగర్ ఎడమ కాలువ ఆయకట్టు రైతాంగం పెద్ద ఎత్తున వరి పంటను వేశారని వాటిని కాపాడటం కోసం ఎడమ కాల ద్వారా హుజూర్నగర్ నియోజకవర్గం లోని వివిధ మేజర్ల ద్వారా నీటిని విడుదల చేసి చెరువులు కుంటలు నింపి వేసిన పంటలు కాపాడాలని సిపిఎం పార్టీ నాయకత్వం భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కి సిపిఎం పార్టీ బృందం విజ్ఞప్తి చేసిందని ఆయన గుర్తు చేశారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెట్టి ముందుగా ఖమ్మం జిల్లా మంచినీటి అవసరాల కోసం పాలేరు రిజర్వాయర్కు నీటిని పంపడం అన్యాయమని వారి నీటి అవసరాలు తీరుస్తూనే నియోజకవర్గంలోని అన్ని మేజర్లకు సాగర్ నీటిని విడుదల చేసి హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఆయకట్టు రైతాంగాన్ని ఆదుకోవాలని స్థానిక ఎమ్మెల్యే నీటిపారుదల శాఖ మంత్రి అయిన ఉత్తంకుమార్ రెడ్డి రైతుల గోసను ఆలకించి ఇప్పటికైనా పంటలను కాపాడటానికి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సాగర్ నీటి ద్వారా చెరువులను కుంటలను నింపడం ద్వారా భూగర్భ జలాలు అందుబాటులోకి వచ్చి రైతులు వేసిన పంట పొలాలు కాపాడబడతాయని కావున సాగర్ నీటి ద్వారా చెరువులు కుంటలు నింపి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ రైతు సంఘం ఆధ్వర్యంలో సాగర్లోని ఎస్ ఈ కార్యాలయాన్ని రేపు అనగా రెండవ తేదీన కార్యాలయం ముట్టడికి సిపిఎం పార్టీ పిలుపునిచ్చిందని ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ వైస్ చైర్మన్ పగడాల మట్టేష్ సిపిఎం పార్టీ రైతు సంఘం నాయకులు ఎర్రెడ్ల మల్లారెడ్డి ఆర్లపూడి వీరభద్రం దిద్దకుంట్ల పురుషోత్తం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :