సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : మఠంపల్లి మండల కేంద్రంలో మండలంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సోషల్ టీచర్స్ ఫోరం ఆధ్వర్యంలో సాంఘిక శాస్త్రం టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ పరీక్షను మండల విద్యాధికారి పానుగోతు చత్రు నాయక్ ప్రారంభించి మాట్లాడుతూ, విద్యార్థులు అన్ని సబ్జెక్టులపై మంచి అవగాహన పెంచుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. ఈ పరీక్ష నిర్వహణ, ఫలితాల ప్రకటన అనంతరం టాలెంట్ టెస్ట్ కన్వీనర్ పిల్లుట్ల.వీరస్వామి మాట్లాడుతూ, మండల స్థాయిలో ఎంపికైన బి . నరహరి, ఏ.కార్తీక్ జడ్పీహెచ్ఎస్ అల్లిపురం,పి. యామిని మోడల్ స్కూల్ మఠంపల్లి , ఎస్.కె జహీర్ జడ్పీహెచ్ఎస్ రఘునాధపాలెం విద్యార్థులకు సూర్యాపేటలో ఫిబ్రవరి 3న జిల్లాస్థాయి టాలెంట్ టెస్ట్ నిర్వహించబడునని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు జి. సతీష్ ,బి. సైదయ్య గౌడ్, బి మల్లేష్, జి. రమేష్, జె. రాజు, ఎస్. సూర్యనారాయణమూర్తి, నరేష్ తదితరులు పాల్గొన్నారు..
-----------------------
Admin