Monday, 27 July 2026 05:04:40 PM
# రంగారెడ్డి జిల్లా అర్బన్ బిజెపి అధికార ప్రతినిధిగా ఎం ఆంజనేయులుసాగర్ నియామకం. # గణేశుడిముందు ద్వజ స్తంభం ప్రతిష్టపాన. # గంజాయి ని పట్టుకున్న గచ్చిబౌలి పోలీస్ లు # వనం నుంచి జనంలోకి సమ్మక్క... # ప్రధాన పార్టీల బీఫామ్ ఎవరికో...? # బరిలో మిగిలేదే వారు...? # న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఖమ్మం బార్ లో ... # త్రాగునీటి సమస్యలను పరిష్కరించిన అధికారులు... # మక్తల్ మున్సిపాలిటీ పరిధిలో బి ఆర్ యస్ పార్టీలో భారీ చేరికలు... # మక్తల్ పట్టణంలో జూనియర్ సివిల్ జడ్జి కోర్ట్ ప్రారంభం... # హైకోర్టు జడ్జి చేతుల మీదుగా మక్తల్ కోర్టు ప్రారంభం... # తెలంగాణ విద్యార్ధులకు సంక్రాంతికి భారీగా సెలవులు జనవరి 10 నుంచి జనవరి 16 వరకు... # నిరుద్యోగ యువతకు సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు ... # వెంకటాపురం మండలంలో కాంగ్రెస్ పార్టీ 140వ ఆవిర్భావ దినోత్సవం... # ఘనంగా కాంగ్రెస్ 140వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు... # వి ఆర్ కె పురం గ్రామపంచాయతీ నూతన సర్పంచ్ గా డర్ర రమ్య పదవి బాధ్యతలు... # వెంకటాపురం మండలంలో డిగ్రీ విద్యార్థి మిస్సింగ్ కేసు నమోదు... # ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి నాకు ఓటు వేయకుంటే... నా డబ్బులు నాకు ఇవ్వండి... # నీవు రాజకీయ నాయకుడివా..? లేదా మాంత్రికుడివా..! # 20 కుటుంబాలతో పేరూరు మాజీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీలో చేరిక...

బీఎస్పీకి పెరుగుతున్న ఆదరణ... రాజ్యాధికారం సాధించాలంటే కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి

Date : 21 August 2023 06:22 AM Views : 329

సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : బీఎస్పీ పార్టీ సిద్ధాంతాలను నమ్మి పార్టీలోకి వచ్చే ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని బీఎస్పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్ర కామేష్ స్పష్టం చేశారు.ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం ఆవరణలో పెద్ద ఎత్తున బహుజన యువజన గర్జన కార్యక్రమం నిర్వహించారు.వినయ్ నేతృత్వంలో సుమారు 500 మంది యువకులు,కార్యకర్తలు వివిధ పార్టీల నుంచి బీఎస్పిలో చేరారు.ఈ సందర్భంగా కామేష్ మాట్లాడుతూ కొత్తగూడెం నియోజకవర్గం నుంచి పెద్ద సంఖ్యలో బీఎస్పీలో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని అన్నారు.కొత్తగూడెం నియోజకవర్గంలో బీఎస్పీలో గెలుపు ఖాయమైందని,అధికార పార్టీ నాయకులకు ఎప్పుడైతే ఓటమి భయం వెంటాడుతుందో అప్పుడే అభద్రతాభావం నెలకొందన్నారు.దళితులు,గిరిజనులు,బడుగు,బలహీన వర్గాలు,మైనార్టీలు లేకుండా ఏ పార్టీ మనుగడ సాగించలేదని గుర్తు చేశారు.కేవలం బహుజన్ సమాజ్ పార్టీపై ఆగ్రహంతో కుల వివక్షతతో వ్యవహరించే నాయకుల పట్ల నియోజకవర్గ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.తాను నిజాయితీని న్యాయాన్ని,ధర్మాన్ని నమ్ముకొని రాజకీయం చేస్తున్నానని స్పష్టం చేశారు.అవినీతి అక్రమాలు దొడ్డిదారిన వచ్చిన డబ్బుతో రాజకీయం చేయడం లేదని అన్నారు.బీఎస్పీలో చేరే ప్రతి ఒక్కరిని, కార్యకర్త నుంచి నాయకుడిగా చేసి దేశానికి బహుమతిగా ఇవ్వడం అలవాటని తెలిపారు.ప్రజలు కూడా ఈసారి జరిగే ఎన్నికల్లో తప్పక న్యాయం వైపు ఉండాలని అధర్మంగా వచ్చిన డబ్బును తీసుకోకుండా ప్రజా జీవితంలో ఉండే బీఎస్పీని, తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా పార్టీలో చేరిన యువకులకు కామేష్ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు సోను,బన్ను,అనురాగ్,దీక్షిత్ తదితరులు పార్టీలో చేరారు. జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,మహిళా కన్వీనర్ బండి రమణి తదితరులు పాల్గొన్నారు.

-----------------------

సయ్యద్ ఇంతియాజ్

Admin

మరిన్ని వార్తలు

Copyright © Sarkar Tv 2026. All right Reserved.

Developed By :