సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ : దేశ ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు పర్యటనలో భాగంగా 2023 ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుండి ఎన్నికల శంకరాల పూరించబోతున్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర యువనాయకులు ఏపీ మిథున్ రెడ్డి అన్నారు. గురువారం షాద్ నగర్ బిజెపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు ఋషికేష్, సీనియర్ నాయకుడు మల్చాలం మురళి, గడియారం సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిథున్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ పాలమూరు జిల్లాలో నిర్వహించే బహిరంగ సభకు షాద్ నగర్ మున్సిపాలిటీ ఇన్చార్జిగా తనను నియమించారని చెప్పారు. ప్రధాని మోడీ సభను 2023 ఎన్నికల శంఖారావం సభగా ఆయన అభివర్ణించారు. బహిరంగ సభను చాలా ప్రతిష్టాత్మకంగా బీజేపీ నాయకులు తీసుకున్నారని చెప్పారు. ఈ బహిరంగ సభకు కనీసం లక్షన్నర మందిని తరలించేలా జన సమీకరణపై దృష్టిపెట్టామని వివరించారు. షాద్ నగర్ మున్సిపాలిటీ ప్రాంతం నుండి కనీసం 15000 మందిని సభకు తరలిస్తున్నట్టు చెప్పారు. మిగతా మండలాలకు ఇంకా ఇతర నాయకులు ఇన్చార్జిలుగా ఉన్నారని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. మోడీ సభతో కెసిఆర్ ప్రభుత్వానికి నూకలు చెల్లుతాయని అన్నారు. రాష్ట్రంలో కేసిఆర్ పాలన అవినీతిమయం అయిందని అన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ చరిష్మా కొనసాగుతుందని అన్నారు. దీనికి నిదర్శనమే జి20 దేశాల సదస్సు ఇక్కడ నిర్వహించడం అని అన్నారు. నరేంద్ర మోడీ విశ్వ గురువుగా పేరుపొందాలరని ఈ సందర్భంగా అన్నారు. తెలంగాణలో జరుగుతున్న అవినీతి అక్రమ పాలనను బిజెపి ఎండకడుతుందని అన్నారు. కేసీఅర్ తో ఏ వర్గం సంతోషంగా లేదని అన్నారు. యువత పెద్ద ఎత్తున కదిలి తరలిరావాలని అన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ప్రజలు ఒక్క అవకాశం ఇవ్వాలని డబుల్ ఇంజన్ సర్కార్ తో సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ప్రజలకు చేర్చి చిరస్థాయిగా చరిత్రలో బిజెపి నిలిచిపోతుందని అన్నారు. మోడీ సభకు పెద్ద ఎత్తున అభిమానులు ప్రజలు కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు.
-----------------------
Admin