సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం మున్సిపాలిటీ లోని ఒక వార్డు కౌన్సిలర్ భర్త డబల్ బెడ్ రూమ్ పేరుతో లక్ష రూపాయలు వసూలు చేసినట్టు ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. డబల్ బెడ్ రూమ్ ఇప్పిస్తానని లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి తీరా..? ఎక్కువ డబ్బు ఇవ్వడంతో ప్లేట్ పిరాయించేసాడు..! బాధితురాలు కౌన్సిలర్ భర్తతో మాట్లాడిన వాయిస్ రికార్డ్ లీక్ అవడంతో విషయం బయటకు వచ్చింది. ఇల్లు పక్కాగా ఇప్పిస్తానని లక్ష రూపాయలు సిద్ధం చేసుకోవాలని అన్నట్టు సమాచారం. ఇంతలో వేరే వారు ఎక్కువ డబ్బు ఇస్తాము అనీ అనడంతో ఇల్లు వారికి కేటాయించినట్టుగా వాయిస్ రికార్డులో తెలుస్తుంది. ఆ లబ్ధిదారులు బంగారం కుదబట్టి ఇల్లు వస్తుందని ఆశతో వేచి చూస్తుండగా పేరు మారిపోవడంతో ఆశ్చర్యపోయారు. తాను కిరోసిన్ పోసుకొని చనిపోతానని దానికి అధికార పార్టీ నాయకులే కారణమని పేరు రాసి చనిపోతానని వాపోయింది. అన్ని వార్డుల్లో డబుల్ బెడ్ రూమ్ అవకతవకలు జరిగాయి... ఈ ఒక్క వాడే కాదు అన్ని వార్డులో ప్రజా ప్రతినిధులు వారి సన్నిహితులకు వారికి నచ్చిన వాళ్ళకి డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించుకున్నారని స్థానికులు వాపోతున్నారు.... డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయింపు అంతా ఒక బూటకం అని ప్రతిపక్ష నాయకులు అంటున్నారు. కేటాయింపు జాబితా అంతా మళ్లీ రీసర్వే చేయించాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ నీ కోరుకుంటున్నారు. అలాగే డబ్బులు వసూలు చేసిన కౌన్సిలర్ భర్తను శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు...
-----------------------
Admin