సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : పాలకవీడు : విఘ్నేశ్వరుడు మండల ప్రజలను చల్లగా చూడాలి అని పాడి పంటలు,వృత్తి వ్యాపారాలు,పరిశ్రమలు దినదినాభివృద్ధి చెందుతూ ప్రజలందరు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఎంపిటిసి ల ఫోరమ్ మండల అధ్యక్షులు మీసాల ఉపేందర్ కోరారు. పాలకవీడు మండల కేంద్రము లోని పుట్టకోట యూత్ ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూజలు నిర్వహించి, బిసి సంక్షేమ సంఘం నాయకులు కొండ శ్రీనివాస్ గౌడ్ ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంను ఆయనతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలందరు భక్తి శ్రద్ధలతో, పూజలు నిర్వహించి,నిమజ్జన కార్యక్రమం కుల మతాలకతీతంగా ప్రశాంత వాతావరణం లో జరుపుకోవాలని కోరారు.ఈ కార్యక్రమం లో యూత్ నాయకులు కొత్తపల్లి సుందరయ్య, బొజ్జ నవీన్, మీసాల నాని, మీసాల గామయ్య, బొజ్జ కమలహాసన్,మనిక్యారావు, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin