సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ మండల కేద్రంలో ఆగస్టు1న జరిగే చలో హైదరాబాద్ కధన భేరీ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని ఎబివిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ పిలుపునిచ్చారు. షాద్ నగర్ పట్టణంలో కళాశాల విద్యార్థులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. కెసిఆర్ నియంత పాలనకు చరమగీతం పడేలా కదం కదం కలిపి కదనభేరి మ్రోగిద్దాం అంటూ విద్యార్థులను కోరారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పాటు కోసం 1200మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే కేవలం కల్వకుంట్ల కుటుంబం మాత్రం లాభం పొందుతున్నారని, రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు, విద్యార్థులకు ఎలాంటి న్యాయం జరగలేదని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 5300కోట్ల స్కోల్లర్షిప్ పెండింగ్ లో ఉందని, ప్రభుత్వ కళాశాలల్లో, పాఠశాల్లో మౌలిక వసతులు కారువయ్యాయి అని, హాస్టల్ పరిస్థితులు మరి దయనీయంగా ఉన్నాయని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, రాష్ట్ర వ్యాప్తంగా 2లక్షల పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలనీ డిమాండ్ చేశారు. ఆగస్టు 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో లక్ష మందితో బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నామని ఆ సభని విజయవంతం చేయాలనీ విద్యార్థులకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కందడి శ్రీరామ్, విద్యార్ధి నాయకులు పుట్నాల సాయి కుమార్, మహేందర్, శ్రీకాంత్, వంశీ, సాయి, రాకేశ్, సలీం, తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin