సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం వేపల గడ్డ అబ్దుల్ కలాం ఇంజనీరింగ్ కళాశాలలో లైన్స్ క్లబ్ ఆఫ్ కొత్తగూడెం శ్రీనగర్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సెమినార్ను హల్లో కె.వి.రంగా కిరణ్ విశిష్ట అతిథులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రంగా కిరణ్ మాట్లాడుతూ భారతరత్న సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ప్రతి ఒక్క విద్యార్థి ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య భారతదేశం గర్వించేదగ్గ ఇంజనీర్ అభివర్ణించారు. అనంతరం కళాశాల సిబ్బందిని సత్కరించారు. కార్యక్రమంలో అతిథులు కోటేశ్వరరావు, డాక్టర్ K.రామారావు, k.చలపతిరావు, అబ్దుల్ కలాం కళాశాల ప్రిన్సిపాల్ సీతారాం ప్రసాద్, ఆకుల నాగేశ్వరరావు గౌడ్, చింతలచెరువు శ్రీనివాస్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
-----------------------
Admin