సర్కార్ టీవీ న్యూస్ / నారాయణపేట జిల్లా : తెలంగాణా దశాబ్ది వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం.. - ఎమ్మెల్యే చిట్టెం. ఆంధ్ర పాలకుల కోరల్లో చిక్కుకుని విలవిలలాడింది తెలంగాణ నేడు శాంతి పావురంలా పచ్చని సింగారంలా,పారే సెలయెరులా,బంగారు తెలంగాణకు బాటలు పడి దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రతి తెలంగాణ బిడ్డ ఈ గడ్డను ముద్దాడుతూ సంబరాలు చేసుకుందాం... పదేళ్ల అభివృద్ధి బంగారు తెలంగాణ కలను కళ్లముందు సాక్షాత్కరింప చేసింది కెసిఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ ప్రభుత్వ సమర్థ నాయకత్వంలో విస్తృత అభివృద్ధి ధ్యేయంగా నేడు తెలంగాణ 24 గంటలు 365 రోజులు వెలిగిపోతుంది. నేడు తెలంగాణ దేశానికి దిక్సూచిగా దిగంతమై వెలుగుతుంది. పలు రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచి ప్రతి పౌరుడు సగర్వంగా చెప్పుకునేలా చేస్తుంది. నిరంతర విద్యుత్తు రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, సిఎం రిలీఫ్ ఫండ్, మిషన్ భగీరథ, షాధి ముబారక్, దళిత బంధు ఇలా చెప్పుకుంటూ పోతే రోజంతా సరిపోని సంక్షేమ పథకాలు అభివృద్ధి ఫలాలు తెలంగాణకు ఎనలేని కీర్తిని చేసింది. గతాన్ని ప్రస్తుతాన్ని నెమరేసుకుందాం జూన్ 2 వ తేదీ నుండి 22 వ తేదీ దాకా జరిగే ప్రతి కార్యక్రమంలో భాగమై కెసిఆర్ అడుగుజాడల్లో నడుద్దాం. మన గౌరవ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి నాయకత్వంలో కలసి నడుస్తూ మక్తల్ నియోజకవర్గం నిరంతర అభివృద్ధికి తోడ్పడాలని వారు తెలిపారు. రేపటి నుండి పలు కార్యక్రమాల్లో మీ వంతు సహకారం అందిస్తారని,దశాబ్ది వేడుకలను శతాబ్ది వరకు చెప్పుకునేలా ఘనంగా నిర్వహిద్దామని కోరుకుంటూ బిఆర్ఎస్ సీనియర్ నాయకులకు,ప్రజాప్రతినిధులకు, కార్యకర్తలకు చిట్టెం అభిమానులకు మక్తల్ నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వక ఆహ్వానం పలుకుతూ...
-----------------------
Admin