సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గడపగడపకు మహిళా కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా పాల్వంచ మండలంలో కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీ కార్డులను అందించడం జరిగింది... గడపగడపకు వెళ్తే మహిళలు వారి సమస్యలను చెప్పడం జరిగింది.. దళిత బంధువు గాని బీసీ బంధువు గృహలక్ష్మి డబుల్ బెడ్ రూమ్... ఏ పథకాలు కూడా మాదాక రానివ్వడం లేదు అని బాధపడ్డారు జిల్లా మహిళ అధ్యక్షురాలు--- తోట దేవి ప్రసన్న మాట్లాడుతూ....ఉదాహరణకుగతంలో ఇందిరమ్మ ఇల్లు అర్హత ఉన్నటువంటి వారికి అందరికీ అందినవి, ఈరోజు పెన్షన్ రావాలి, దళిత బందు బీసీ బందు రావాలి అంటే అధికార పార్టీ బంధువులకు వాళ్ల శ్రేయోభిలాషులకు తప్ప పబ్లిక్ కి ఏ బంధు ఏ పథకం వర్తించదు ఒక వేళ కావాలి అంటే ఏంటి మన పరిస్థితి మనం చెప్పక్కర్లేదు ప్రజల నోటితోనే జవాబు చెప్తారు..…. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది... ప్రభుత్వం మారింది 20 శాతం-30 శాతం కమిషన్ ఇస్తేనే పథకాలు వర్తింప చేస్తున్నారు... ప్రభుత్వ పథకం పేదవాన్నికి వర్తింపజేయాలి అంటే చేతులు తడపాల్సిందే.... ఇది మన దౌర్భాగ్యం రానున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే... మళ్లీ ఇందిరమ్మ రాజ్యం వస్తది పేదవాని ఇంటి కల నెరవేరుతది అని అన్నారు *కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ కార్డులపై వారికి అవగాహన కలిగించారు... ఈ కార్యక్రమంలో ఖమ్మం పార్లమెంట్ కోఆర్డినేటర్ అమర్ జోహార్ మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిలు, అసెంబ్లీ కోఆర్డినేటర్స్ పొదిలి జ్యోతి, సరితా పందాల, బోడదివ్య, నాగేశ్వరి, గౌరీ, బ్లాక్ పట్టణ మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సున్నం లక్ష్మి, శ్రీలక్ష్మి, శారద, రాజేశ్వరి భవాని, స్వర్ణకుమారి ,పద్మ, శిరీష, చిన్ని ,సావిత్రి, భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin