సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : భారతీయ జనతా పార్టీ సూర్యాపేట పట్టణం మరియు సూర్యాపేట మండల సభ్యత్వ నమోదు కార్యక్రమ వర్క్ షాప్ ను పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.ఇట్టి సమావేశానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు హాజరై మాట్లాడుతూ సెప్టెంబర్ మొదటివారం నుండి అక్టోబర్ 15వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు.భారతీయ జనతా పార్టీ నాయకులు అందరూ సమన్వయంతో పనిచేసి సూర్యాపేట నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సభ్యత్వాలు చేయాలన్నారు... 100 సభ్యత్వాలు చేసిన వారికే క్రియాశీల సభ్యత్వం వస్తుందని క్రియాశీలక సభ్యత్వం వచ్చిన వారికే మండల, జిల్లా స్థాయిలో పదవులు వస్తాయని కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతి పోలింగ్ బూత్ లో సభ్యత్వాలు చేయాలన్నారు.ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ బిజెపి సభ్యత్వ ఇన్చార్జిలుగా రంగినేని లక్ష్మణరావు, గోగుల రమేష్, సలిగంటి శ్రీనివాస్, నూకల శైలేందర్ ను నియమించారు . సూర్యాపేట మండల సభ్యత్వ ఇన్చార్జిలుగా ఉప్పు శ్రీనివాస్, జ్యోతుల యుగేందర్, పలస వెంకన్న, రవి లను నియమించారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ కర్నాటి కిషన్, జిల్లా ఉపాధ్యక్షులు చల్లమల్ల నరసింహ, మైనారిటీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఎం డి అబీద్, జిల్లా సీనియర్ నాయకులు వెన్న చంద్రారెడ్డి, మండల అధ్యక్షులు వెన్న శశిధర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి అయితగాని జానయ్య గౌడ్, పట్టణ ప్రధాన కార్యదర్శి ఆరూరి శివ తదితరులు పాల్గొన్నారు....
-----------------------
Admin