సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : కొత్తగూడెం : గాంధీ జయంతి సదర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగూడెం పార్టీ కార్యాలయంలో మహాత్మా గాంధీ 154 వ జయంతి సందర్భంగా పూజ్య బాపూజీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా శ్రీ ముత్యాల హనుమంతరావు పాల్గొన్నారు. కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ అవుటపల్లి రాంబాబు, ముత్యాల హనుమంతురావు మాట్లాడుతూ మహాత్మా గాంధీ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆయన ఆశయాలను భావితరాలకు నేర్పడమే ఆయనకు మనం ఇచ్చే నిజమైన గౌరవమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ముత్యాల హనుమంతరావు, కొత్తగూడెం అసెంబ్లీ కన్వీనర్ అవుటపల్లి రాంబాబు,పార్టీ ముఖ్య నేతలు శ్రీ ఏర్రి భాస్కర్, శ్రీ యస్ కే అఫ్జల్, మరియు శ్రీ గిరి సురేష్ కుమార్ నివాళులు అర్పించారు.
-----------------------
Admin