సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హుజూర్ నగర్ పట్టణ కేంద్రంలోని మదర్ తెరిసా జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు . ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు మాట్లాడుతూ మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశం కాని దేశం వచ్చి తల్లి, తండ్రి లేని అభాగ్యులను అక్కున చేర్చుకుని చేరదీసి కన్న తల్లి లాగా సేవ చేసిన మదర్ తెరిసా భారతరత్న అవార్డు గ్రహీత భారతదేశం లోని కలకత్తా నగరం లో మురికివాడలలో ఎంతో మంది అనాధ పిల్లలకు చదువు చెప్పడంతో పాటు అదేవిధంగా వికలాంగులకు,రోగులకు, కుష్టు వ్యాధి వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు "ప్రార్థించే పెదవుల కన్నా!.. సాయం చేసే చేతులు మిన్న! అని నినాదం చాటి చెప్పిన మానవతా మూర్తి భారతరత్న గ్రహీత మదర్ తెరిసా ప్రేమ శాంతిని దేశంలో నెలకొల్పింది. ఈ ప్రపంచంలో ఐకమత్యానికి దారి చూపగలిగేది కేవలం పవిత్రమైన ప్రేమ అంటూ ఎంతో మంది అనాధలకు అక్కున చేర్చుకొని ప్రేమను పంచిన మదర్ తెరిసా జయంతి సందర్భంగా డిఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేవత గుణం గల ప్రేమను పంచ శాంతి మూర్తికి ఇవే మా ఘననివాళులు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు .PNR టైలర్ పాశం నరసింహారావు పొదిల తిరపతి రెడపగు రాజేష్ ములకలపల్లి నరేష్ మాడుగుల దశరథ అరవింద్ రాజు పత్తిపాటి ఇట్టి మల్ల శీను పిట్టల బాలు తదితరులు పాల్గొనడం జరిగింది
-----------------------
Admin