సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : పాల్వంచ: బహుజన రాజ్యాధికార సాధనే లక్ష్యంగా అందరూ కృషి చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్ అన్నారు.పాల్వంచ పట్టణ అధ్యక్షుడు కోళ్ళపూడి ప్రవీణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కాటబోయిన వసుంధర ఆధ్వర్యంలో గురువారం పలువురు బీఎస్పీ పార్టీలో చేరారు.వారికి పార్టీ కార్యాలయం వద్ద కామేష్ ఖండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఎస్పీకి పట్టణ,గ్రామాల్లో మంచి ఆదరణ లభిస్తోందన్నారు.ప్రజలకు కనీస అవసరాలైన విద్య,వైద్యంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు.జనాభాలో 85 శాతానికి పైగా ఉన్న బహుజనుల హక్కులను,స్వేచ్ఛను అగ్రవర్ణ పాలకులు కాలరాస్తున్నారని ఆరోపించారు.బహుజనుల జీవితాలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చి,సామాజిక మార్పుతో రాజ్యాంగాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయాలంటే రాజ్యాధికారంతోనే సాధ్యమవుతుందన్నారు.అంబేద్కర్ ఆలోచన విధానంతో స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరూ సైనికుల్లా పని చేయాలన్నారు. ఈకార్యక్రమంలో జిల్లా సలహాదారు గంధం మల్లికార్జున్ రావు,జిల్లా మహిళా కన్వీనర్ బండి రమణి,కాటబోయిన ఇంద్రచరణ్,అంజలి,హర్షిత,ఎండీ.అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు
-----------------------
Admin