సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : హుజూర్ నగర్ శాసన సభ్యులు శానంపూడి సైదిరెడ్డి మెల్లచేరువు మండల కేంద్రంలో నిన్న శివైక్యం చెందిన గ్రామ పురోహితులు మరియు శివాలయ మాజి అర్చకులు శ్రీ కొంకిపాక వెంకటేశ్వర శర్మ (వెంకటయ్య ) ఇంటికి వెళ్లి వారి చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఈ సందర్బంగా శాసన సభ్యులు మాట్లాడుతూ ..వెంకటయ్య లేని లోటు పూడ్చలేనిదని , ఆధ్యాత్మికముగా వారు ప్రజాలకు ఎంతో నేర్పించారని, వారి మార్గంలోనే అందరూ నడవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమములో ప్రజాప్రతినిధులు,నాయకులు,పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin