సర్కార్ టీవీ న్యూస్ / నిజామాబాద్ జిల్లా : బాల్కొండ మండలంలో బుధవారం రోజున జిల్లా అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రా పర్యటించడం జరిగింది ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు వెచ్చిస్తూ అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మన ఊరు - మన బడి కార్యక్రమం కింద పలు స్కూల్లాలో చేపడుతున్న పనులలో నాణ్యత లోపించ కుండా చూడాలని అడిషనల్ కలెక్టర్ చిత్రా మిశ్రా అన్నారు. బుధవారం రోజున బాల్కొండ మండలంలోని, బోదేపల్లి ,జలాల్పూర్, నాగాపూర్, బస్సాపూర్ ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నమెంట్ స్కూల్ లు కార్పోరేట్ స్థాయి సదుపాయాలతో స్పష్టమైన మార్పును సంతరించుకోవాలని అడిషనల్ కలెక్టర్ సూచించారు.ఉపాది హామి పనులు సాధ్య మైనంత త్వరగా పూర్తి చేయాలని, గ్రీన్ చానల్ ద్వారా నిధులను విడుదల చేయడం జరుగుతుందని అడిషనల్ కలెక్టర్ తెలిపారు.మండల మోడల్ స్కూల్ ల లో జరిగే పనుల నాణ్యతను పరిశీలించి పలు సూచనలను ఇచ్చారు.నాణ్యతతో పనులు జరిగేలా చూడాలని, ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. చాలా వరకు స్కూల్ ల నిర్వహణ కమిటీలకే పనుల బాధ్యతలు అప్పగించినందున, ప్రభుత్వ బడులను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దుకోవాలని హితవు పలికారు. గోడలకు ఎక్కడ కూడా పగుళ్లు కనిపించకూడదని, అలాంటి చోట్ల స్క్రబ్ చేయించిన తర్వాత ప్లాస్టరింగ్ పనులు జరిపించాలన్నారు. పనుల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని, ఎస్ఎంసీ ప్రతినిధులు సొంత పనులుగా భావిస్తూ పకడ్బందీ పర్యవేక్షణ చేయాలని సూచించారు. కిటికీలు, తలుపులకు పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయించాలని, పైకప్పు లీకేజీలు ఉండరాదని అన్నారు.ఎం పి డి ఓ సంతోష్ కుమార్ ను ఉపాధి హామి పనుల పురోగతి పై అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎం ఈ ఓ బట్టు రాజేశ్వర్, అసిస్టంట్ ఇంజనీర్ వినీత్ కుమార్, ఏ పి ఓ ఇందిర ,ఆయా గ్రామాల సర్పంచ్ లు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
-----------------------
Admin