సర్కార్ టీవీ న్యూస్ / సూర్యాపేట జిల్లా : రాష్ట్రవ్యాప్తంగా జిపి కార్మికులు 18 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులను చర్చలకు పిలవని రాష్ట్ర ప్రభుత్వ కఠిన వైఖరి సరైనది కాదని, చర్చల ద్వారా గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యను పరిష్కరించాలని భవన నిర్మాణ కార్మిక సంఘం (సిఐటియు అనుబంధం) జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ అన్నారు. హుజూర్నగర్ ఎంపీడి ఓ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులకు భవన నిర్మాణ కార్మిక సంఘం తరపున సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలో సుమారు 50వేల మంది సిబ్బంది స్వీపర్లుగా, పారిశుద్ధ్య కార్మికులుగా, పంపు ఆపరేటర్లుగా, ఎలక్ట్రిషన్లుగా, డ్రైవర్లుగా, కారోబార్లుగా, బిల్లు కలెక్టర్ లుగా వివిధ కేటగిరిలో పనిచేస్తున్నారాని వీరికి నెలకు 8500/- జీతంతో రాష్ట్రప్రభుత్వం వెట్టిచాకిరి చేయిస్తుందని కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయక ప్రజల శ్రేయస్సు కోసం చెమటోడ్చిన జిపి కార్మికుల న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని, కోరారు.
-----------------------
Admin