సర్కార్ టీవీ న్యూస్ / రంగారెడ్డి జిల్లా : షాద్ నగర్ / దేశంలోనే తెలంగాణ సంక్షేమ నిధి అని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ సంక్షేమ సంబురాల కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ ప్రవేశపెడుతున్న పథకాలు ఇంటింటికి చేరుతున్నాయని అన్నారు. నిరుపేద ప్రజల సంక్షేమం సీఎం కేసీఆర్ తోనే సాధ్యమన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేసిందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా కుల వృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ సర్కార్ అని తెలిపారు. కుల వృత్తుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన లక్ష రూపాయల పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు.
-----------------------
Admin