సర్కార్ టీవీ న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా : భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తేదీ 29.5.23 న ఉదయం కూనవరం రోడ్ చెక్ పోస్ట్, CRPF Camp వద్ద శ్రీకాంత్ ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది వాహనాల తనిఖీలు చేస్తుండగా మల్కన్ గిరి, ఒరిస్సా రాష్ట్రం నాకు చెందిన ఇద్దరు వ్యక్తులు ట్రాక్టర్ లో 485 కిలోల గంజాయినీ ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోగల మల్కణ్ గిరి వద్ద నుండి కరీంనగర్ కు భద్రాచలం మీదుగా అక్రమంగా తరలిస్తుండగా రఘునాథ్ & రబింద్ర అను ఇద్దరినీ పట్టుకోవడం జరిగింది. మరో ఆరుగురు కూడా ఈ అక్రమ గంజాయి తరలింపులో భాగస్వాములుగా ఉన్నారు. ఒక్కొక్క గంజాయి ప్యాకెట్ 5 కిలోల బరువు ఉంటుంది. మొత్తం 97 ప్యాకెట్ లు ఉంటాయి. పట్టుబడిన గంజాయి విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. ఇట్టి గంజాయి తరలింపుకు ట్రాక్టర్ ట్రాలీ కి సీక్రెట్ ఛాంబర్ ను ఏర్పాటు చేసుకొని పలుమార్లు విజయవాడ గుంటూరు కరీంనగర్ లలో అమ్మినట్లుగా తెలిపారు. భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు రెడ్డి కేసు నమోదు చేసి ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించడం జరిగింది.
-----------------------
Admin