సర్కార్ టీవీ న్యూస్ / నల్గొండ జిల్లా : మిర్యాలగూడ మండలం, అవంతిపురం గ్రామము నందు గత రెండు సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నాను.ట్రాక్టర్, ట్రాలీ ట్యాంకర్ రిజిస్ట్రేషన్ కు డబ్బులు డ్రా చేశాననే విషయం నిరాధార ఆరోపణ. గ్రామ పంచాయతీ పరిధి మొత్తం 628 సర్వే నెంబర్ లో ప్రభుత్వ భూమి ఉన్నది. 2015-16 రివిజన్ రికార్డ్ ప్రకారం మాత్రమే రికార్డు మైంటైన్ చేయడం జరుగుతుంది. నేను రికార్డు మార్చుటకు గాని, జననం & మరణ ధృవీకరణ పత్రాలు, మ్యారేజ్ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి గాని డబ్బులు తీసుకుంటున్నాను అనే దానిలో ఎటువంటి వాస్తవం లేదు నేను ఎలాంటిఅవకతవకలకు కూడా పాల్పడలేదు. అవంతిపురం గ్రామపంచాయతీ పరిధిలో నేను వచ్చిన తర్వాత ఎలాంటి కొత్త లేఔట్స్ జరగలేదు. అని నాపై వారు ఇచ్చిన కంప్లైంట్ గాని, వారు చేసిన ఆరోపణలు గాని వాస్తవాలు కాదు. అవంతిపురం మాజీ MPTC భర్త సురేష్, నేను విదులలో చేరినప్పటి నుండి తను చెప్పినట్లుగా వ్యవహరించడం లేదని మరియు తన స్వంత ఖాళీ భూములను రికార్డులలో నమోదుచేయలేదని నన్ను వ్యక్తిగతంగా, మానసికంగా వేధిస్తున్నాడు స్పెషల్ ఆఫీసర్ పీరియడ్ నుండి తను చెప్పినట్లుగా నడుచుకోవాలని,గ్రామపంచాయితీ నిధుల నుండి తనకు వర్క్ లు ఇవ్వాలని లేనిచో గ్రామప్రజలతో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు చేయించి, నన్ను సస్పెండ్ చేపిస్తానని, ఇక్కడి నుండి దూర ప్రాంతాలకు బదిలీ చేయిస్తానని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు , నాయొక్క మనోభావాలు దెబ్బతినే విదంగా తన అనుచరులతో వాట్సాప్ గ్రూప్ లో నేను ఒక మహిళా ఉద్యోగినని చూడకుండా నాపై పోస్టులు అవమానకరంగా పెట్టించి, నన్ను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. కాని నేను ఈరోజు వరకు ఎలాంటి అవినీతికి పాల్పడలేదు. కావున నా పై అధికారుల ఎలాంటి విచారాణకైనా నేను సిద్ధంగా ఉన్నాను. అని పంచాయతీ కార్యదర్శి గాయత్రి తెలిపారు
-----------------------
Admin